మద్రాసు మ్యూజిక్ అకాడెమి ప్రశంసలు

Demonstrating Swaranidhi at Madras Music Academy

మద్రాసు మ్యూజిక్ అకాడమీ వేదికపై తొలి ప్రదర్శ న

మద్రాస్ సంగీత అకాడమీ వారి ఆహ్వానము మేరకు డిసెంబరు 24,2014 నాడు స్వర వీణాపాణి తన అపూర్వ స్వర కల్పనను విశిష్టఅతిధుల సమక్షంలో ఆనందాతిరేకాల మధ్య ప్రదర్శించారు. వారిలో సంగీతజ్ఞులు, విఖ్యాత గాయినీ గాయకులు, వాద్యకారులు మరియు సంగీత రసజ్ఞులు ఎందరోవున్నారు . ప్రఖ్యాతులైన హైదరాబాదు సోదరులు ఈ కార్యక్రమానికి తమ మధుర గాత్రంతో సహకరించడమే కాక స్వరనిది సాధించే వివిధ అంశాలను విపులీకరించారు. ఈ సభకు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. స్వర వీణాపాణి తన ఏకలవ్య శిష్యుడని సభకు పరిచయంచేస్తూ ఈ ప్రయోగాన్ని ఒక అనితర సాధ్యమైన కల్పనగా అభివర్ణిస్తూ సంగీత కళానిధి పద్మభూషణ్ టి.వి.గోపాలక్రిష్ణన్ ఈ సృజన సంగీత విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతగానో ఉపయుక్తమవుతుందని ప్రకటించారు.

తన స్పందనను తెలియజేస్తూ వీణాపాణి ఇందులో తన పాత్ర ఒక మాధ్యమ౦ మాత్రమేనని సజీవ భారతీయ సంగీతాన్ని భావి తరాలవారికి అందజేయాలనుకుంటున్నట్లు చెప్పారు.




NEWS UPDATES