Demonstrating Swaranidhi at Madras Music Academy
మద్రాస్ సంగీత అకాడమీ వారి ఆహ్వానము మేరకు డిసెంబరు 24,2014 నాడు స్వర వీణాపాణి తన అపూర్వ స్వర కల్పనను విశిష్టఅతిధుల సమక్షంలో ఆనందాతిరేకాల మధ్య ప్రదర్శించారు. వారిలో సంగీతజ్ఞులు, విఖ్యాత గాయినీ గాయకులు, వాద్యకారులు మరియు సంగీత రసజ్ఞులు ఎందరోవున్నారు . ప్రఖ్యాతులైన హైదరాబాదు సోదరులు ఈ కార్యక్రమానికి తమ మధుర గాత్రంతో సహకరించడమే కాక స్వరనిది సాధించే వివిధ అంశాలను విపులీకరించారు. ఈ సభకు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. స్వర వీణాపాణి తన ఏకలవ్య శిష్యుడని సభకు పరిచయంచేస్తూ ఈ ప్రయోగాన్ని ఒక అనితర సాధ్యమైన కల్పనగా అభివర్ణిస్తూ సంగీత కళానిధి పద్మభూషణ్ టి.వి.గోపాలక్రిష్ణన్ ఈ సృజన సంగీత విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతగానో ఉపయుక్తమవుతుందని ప్రకటించారు.
తన స్పందనను తెలియజేస్తూ వీణాపాణి ఇందులో తన పాత్ర ఒక మాధ్యమ౦ మాత్రమేనని సజీవ భారతీయ సంగీతాన్ని భావి తరాలవారికి అందజేయాలనుకుంటున్నట్లు చెప్పారు.